సిద్దిపేట జిల్లాలో 184 కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-09-29T07:32:16+05:30 IST
జిల్లాలో సోమవారం 184 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట డివిజన్లో 125 కేసులు, గజ్వేల్ డివిజన్లో 35,
ఒకరి మృతి
సిద్దిపేట, సెప్టెంబరు28: జిల్లాలో సోమవారం 184 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట డివిజన్లో 125 కేసులు, గజ్వేల్ డివిజన్లో 35, హుస్నాబాద్ డివిజన్లో 24 కేసుల చొప్పున నమోదయ్యాయి. హుస్నాబాద్ మండలం ఎస్.పోతారం గ్రామస్థుడు ఒకరు మృతి చెందారు.
సిద్దిపేట డివిజన్లో సిద్దిపేటలో21 , చేర్యాల సీహెచ్సీలో 3, పీహెచ్సీల వారీ గా చిన్నకోడూరులో 4, ఇబ్రహింనగర్లో 1, దౌల్తాబాద్లో 2, ఇందుప్రియాల్లో 1, దుబ్బాక సీహెచ్సీలో 2, పీహెచ్సీల వారీగా రామక్కపేటలో 6, తిమ్మాపూర్లో 7, కొమురవెల్లిలో 1, మిరుదొడ్డిలో 6, భూంపల్లిలో 7, రాజగోపాల్పేటలో 6, నంగునూరులో 4, నారాయణరావుపేటలో 8, పుల్లూరులో 23, సిద్దిపేటలోని నాసర్పుర యూపీహెచ్సీలో 13, అంబేడ్కర్నగర్ యూపీహెచ్సీలో 8, తొగుటలో 2 కేసులు నమోదయ్యాయి.
గజ్వేల్ డివిజన్లో గజ్వేల్ ఆస్పత్రిలో 8, పీహెచ్సీల వారీగా అహ్మదీపూర్లో 1, సిరిగిరిపల్లిలో 2, జగదేవ్పూర్లో 4, తిగుల్లో నిల్, కొండపాకలో 3, కుకునూరుపల్లిలో 2, మర్కుక్లో 1, ములుగులో 5, సింగన్నగూడెంలో 7, రాయపోల్లో 1, వర్గల్లో 1 కేసు నమోదయ్యాయి.
హుస్నాబాద్ డివిజన్లో పీహెచ్సీల వారీగా అక్కన్నపేటలో 3, బెజ్జంకిలో నిల్, తోటపల్లిలో 1, హుస్నాబాద్లో 12, కోహెడలో 5, మద్దూరులో నిల్, లద్నూర్లో 3 కేసులు వెలుగుచూశాయి.