విద్యుదాఘాతంతో యువ రైతు మృతి
ABN , First Publish Date - 2020-11-01T08:08:07+05:30 IST
బోరు మోటారును ఆన్ చేయడానికి వెళ్లిన యువ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి
అయిజ, అక్టోబరు 31 : బోరు మోటారును ఆన్ చేయడానికి వెళ్లిన యువ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన రైతు విజయ్ (28)కి రెండు ఎకరాల పొలం ఉంది. ఇందులో ప్రస్తుతం పత్తి పంటను సాగు చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే శనివారం పం టకు నీరు పెట్టేందుకు పొలం వద్దకు వెళ్లాడు. బోరు మోటా రును ఆన్ చేస్తుండగా, సర్వీస్ తీగలు తగలడంతో విద్యుదాఘా తానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.