విశ్వశాంతి కోసం ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2020-12-02T03:59:00+05:30 IST
విశ్వశాంతి కోసం జిల్లా కేంద్రంలోని శబరి పీఠంలో అయ్యప్ప స్వామికి అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నారాయణపేట/ టౌన్, డిసెంబరు 1: విశ్వశాంతి కోసం జిల్లా కేంద్రంలోని శబరి పీఠంలో అయ్యప్ప స్వామికి అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాముల భజన సంకీర్తనలతో శబరి పీఠం మార్మోగింది. కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా అధ్యక్షుడు కాకర్ల భీమయ్య, గురుస్వాములు రాజశేఖర్, కన్నయ్య, అంజీ, బాలు, సచిన్, భరత్,అంజప్ప, హన్మంతు, మణికంఠ పాల్గొన్నారు.