సచివాలయాన్ని ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించండి
ABN , First Publish Date - 2020-03-28T11:55:55+05:30 IST
రాష్ట్ర సచివాలయాన్ని కరోనా వైరస్ బాధితులకు చికిత్సలు అందించడానికి ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించాలని బీసీ సంక్షేమ
కొత్తకోట, మార్చి 27: రాష్ట్ర సచివాలయాన్ని కరోనా వైరస్ బాధితులకు చికిత్సలు అందించడానికి ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించాలని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాసి పంపారు. కరోనా వైరస్ను కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పని చేస్తుండడం హర్షనీయమన్నారు. రాత్రింబగళ్లు విధులు నిర్వహిస్తున్న వైద్య, పోలీసు, శానిటేషన్ సిబ్బందికి ప్రతి ఒక్కరూ జేజేలు పలకాలన్నారు.