టీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-12-08T03:30:07+05:30 IST
టీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు.

నారాయణపేట టౌన్, డిసెంబరు 7: టీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. సోమవా రం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో గిట్టని కొందరు తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అవస రమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను తప్పా టీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందించా రు. అలాగే జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో నారాయణపేట పట్టణం, మండలాలకు చెందిన 133 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వనజ, మునిసిపల్ చైర్పర్సన్ గందె అనసూయ జడ్పీటీసీ అంజలి, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కె.నర్సింహారెడ్డి పాల్గొన్నారు.