రేపటి నుంచి మళ్లీ ముంబాయి బస్సు
ABN , First Publish Date - 2020-12-03T04:24:32+05:30 IST
మహబూబ్నగర్ నుంచి ముంబాయి ఎక్స్ప్రెస్ బస్సులు సేవలు మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ రాజారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మహబూబ్నగర్ టౌన్, డిసెంబరు 2: మహబూబ్నగర్ నుంచి ముంబాయి ఎక్స్ప్రెస్ బస్సులు సేవలు మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ రాజారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 4నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. మహబూబ్నగర్ నుంచి ముంబాయి (కుర్లీ) స్టేషన్ వరకు ఈబస్సు నడుస్తుందని వెల్లడిం చారు. బస్సు ఉదయం 10.45కు వనపర్తిలో బయలుదేరే మధ్యాహ్నం 12గంటలకు మహబూ బ్నగర్కు చేరుకొంటుందని ఇక్కడి నుంచి బయలుదేరి మరునాడు ఉదయం కుర్లి స్టేషన్కు చేరుకుంటుందని వెల్లడించారు. ఈసర్వీసుని ప్రయాణీకులు వినియోగించుకో వాలని కోరారు.