జూరాల ప్రాజెక్టును రీ డిజైన్ చేయాలి
ABN , First Publish Date - 2020-06-01T10:19:47+05:30 IST
జూరాల ప్రాజెక్టు సామర్థ్యంను పెంచి రీడిజైన్ చేయా లని టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి తిరుమలేష్ డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో
అమరచింత, మే 31: జూరాల ప్రాజెక్టు సామర్థ్యంను పెంచి రీడిజైన్ చేయా లని టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి తిరుమలేష్ డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. దక్షిణ తెలంగాణలో ఉన్న జూరాలను రీడిజైనింగ్ చేసి దక్షిణ తెలంగాణ ప్రాం తాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు బు చ్చిరెడ్డి, దాసు, జానిస్టు, కోరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
నీటి సామర్థ్యాన్ని పెంచాలి
జూరాల ప్రాజెక్టు రీ డిజైన్ చేసి నీటి సామర్థ్యాన్ని పెంచాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాలపల్లి రామన్గౌడ్ డిమాండ్ చేశారు. స్థానికంగా ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పంటల నియంత్రణ విషయంలో సీఎం కేసీఆర్ తొందర పడ్డారని ఆయన ఆరోపించారు.