రేపు ప్రగతి భవన్‌ ముట్టడి

ABN , First Publish Date - 2020-09-24T07:22:56+05:30 IST

పొడు భూములను సాగు చేసుకుంటున్న వారికి పాసు పుస్తకాలు అందించాలని ఈ నెల 25న ప్రగతిభవన్‌ను ముట్టడించనున్నట్లు గిరిజన

రేపు ప్రగతి భవన్‌ ముట్టడి

బాదేపల్లి, సెప్టెంబరు 23: పొడు భూములను సాగు చేసుకుంటున్న వారికి పాసు పుస్తకాలు అందించాలని ఈ నెల 25న ప్రగతిభవన్‌ను ముట్టడించనున్నట్లు గిరిజన విద్యార్థి సంఘం నాయకులు రమేష్‌నాయక్‌ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. హరితహారం పేరుతో పొడు భూములపై అటవీశాఖ అధికారులు చేస్తున్న దాడులను ఆపాలన్నారు. ఎస్టీల రిజర్వేషన్‌ను 6 నుంచి 12 శాతానికి పెంచాలని, తండాలను రెవెన్యూ పంచాయతీలుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రగతి భవన్‌ ముట్టడి కార్యక్రమాన్ని గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులు, మేధావులు హాజరై విజయవంతంచేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు లోకేష్‌, శ్రీను, రాజు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-24T07:22:56+05:30 IST