ఈ నెలాఖరి వరకు కాగిత రహిత పాలన ప్రారంభించాలి

ABN , First Publish Date - 2020-09-05T07:35:34+05:30 IST

అన్నికార్యాలయాల్లో ఈ నెలాఖరి లోగా కాగిత రహిత పాలనను ప్రా రంభించాలని మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఆదే శించారు...

ఈ నెలాఖరి వరకు కాగిత రహిత పాలన ప్రారంభించాలి

కలెక్టరేట్‌ (మహబూబ్‌నగర్‌),సెప్టెంబరు4 : అన్నికార్యాలయాల్లో ఈ నెలాఖరి లోగా కాగిత రహిత పాలనను ప్రా రంభించాలని మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఆదే శించారు. శుక్రవారం బోర్డ్‌ ఆఫ్‌ ఇం టర్మీడియట్‌ కార్యాలయానికి సం బంధించి ఈ ఆఫీస్‌(ఎలకా్ట్రనిక్‌ కా ర్యాలయాన్ని)ను ఆయన  ప్రారం భించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఈ ఆఫీస్‌ ద్వారా పాలన పా రదర్శకంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఐసీ డీఐఓ సత్యనారాయణ మూర్తి, ఈ ఆఫీస్‌ జిల్లా అధికారి వాసుదేవరావ్‌, బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, కార్యాలయం సూపరింటెండెంట్‌ పి.సందీప్‌ కుమా ర్‌ రెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్‌ కె.అనిత పాల్గొన్నారు.


రాచాలలో అభివృద్ధి పనుల పరిశీలన  

అడ్డాకుల: మండల పరిధిలోని రాచాల, వేములలో శుక్రవారం కలెక్టర్‌ వెంకట్‌ రావ్‌ పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ నాగార్జు న్‌రెడ్డి, తహసీల్దార్‌ రాంబాయి, ఎంపీడీఓ మంజుల, వ్యవసాయాధికారి శ్రీనివా సులు , పీఆర్‌ఈఈ, ఆర్‌అండ్‌బీ డీఈ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-05T07:35:34+05:30 IST