ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవుట్‌ పేషెంట్ల సంఖ్య పెంచాలి

ABN , First Publish Date - 2020-10-04T09:18:52+05:30 IST

జిల్లా ప్రధానాస్పత్రితో పాటు, అన్ని పీహెచ్‌సీలలో అవుట్‌ పేషెంట్ల సం ఖ్యను పెంచాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు సూచించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవుట్‌ పేషెంట్ల సంఖ్య పెంచాలి

కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు


కలెక్టరేట్‌, అక్టోబరు 3: జిల్లా ప్రధానాస్పత్రితో పాటు, అన్ని పీహెచ్‌సీలలో అవుట్‌ పేషెంట్ల సం ఖ్యను పెంచాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు సూచించారు. శనివారం ఆయన కలెక్టర్‌ కార్యాలయం నుంచి వైద్యశాఖ అధికారులతో వెబినార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌-19 పరీక్షలకు ఎవరినీ హైదరాబాద్‌ పంపాల్సిన అవసరం లేదన్నా రు. అన్ని పరీక్షలు, వైద్యసేవలు ఇక్కడే అందు బాటులో ఉన్నాయని చెప్పారు. కొవిడ్‌ బాధితులకు పండ్లతో పాటు, నాణ్యమైన పోషకా హారం అందించాలన్నారు.


మండల వైద్యాధికారులు తమ పరిధిలో ఉన్న కోవిడ్‌ బాధితుల్లో 50 శాతం మందిని రోజూ సందర్శించాలని సూచించారు. పీహెచ్‌సీలను ఆదివారం కూడా తెరవాలని సూచించారు. ఈ నెల 5 నుంచి 12 వరకు నిర్వహించే నులిపురుగుల నివారణ వారోత్సవాలకు అన్ని శాఖలు సహకరించాలన్నారు. పట్టణాలు, గ్రామాల్లో నిరంతరం దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణులకు ఎలాంటి ఆటంకాల్లేకుండా వైద్యం అందించాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్‌ నందలాల్‌ పవార్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కృష్ణ, వైద్యాధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-04T09:18:52+05:30 IST