ఎండ సెగ
ABN , First Publish Date - 2020-04-26T10:24:56+05:30 IST
ఎండా కాలం సెగ ఇప్పుడిప్పుడే తగులుతోంది.. ఇ న్నాళ్లు కాస్త తక్కువగానే ఉన్న ఎండలు ఒ క్కసారిగా పెరగడంతో తేమ శాతం అంత

41 డిగ్రీలకు చేరిన పగటి ఉష్ణోగ్ర త
రెండ్రోజులుగా పెరిగిన ఉక్కపోత
మహబూబ్నగర్, ఏప్రిల్ 25 : ఎండా కాలం సెగ ఇప్పుడిప్పుడే తగులుతోంది.. ఇ న్నాళ్లు కాస్త తక్కువగానే ఉన్న ఎండలు ఒ క్కసారిగా పెరగడంతో తేమ శాతం అంత కంతకు పడిపోతున్నది. జనం దృష్టంతా క రోనాపైనే కేంద్రీకృతం కావడం, లాక్డౌన్తో ఉదయం 10 గంటల నుంచి బయట తిరగే అవకాశం లేకపోవడంతో ఎండాకా లం అ న్న ఫీలింగ్ లేకుండానే గడిచిపోతున్నది.
ఇ ప్పుడిప్పుడే పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దా టుతుండటంతో ఉక్కపోత మొదలైంది. రెం డ్రోజుల నుంచి జిల్లాలో 40 డిగ్రీలు దాటు తుండటంతో ఉక్కపోత, ఉబ్బరం, వడగాల్పులు ప్రారంభమవుతున్నాయి. ఇదిలా ఉంటే, రోడ్లపై వందల సంఖ్యలో ఉష్ణతాపానికి ప్రత్యామ్నాయాలుగా శీతలపానీ యాలు, జ్యూస్ సెంటర్లు, లస్సీ, చెరుకు బండ్లు,, ఐస్క్రీమ్ పార్లర్లు ఉండేవి. ఇప్పుడు వాటన్నింటిని మూసివేయడంతో వ్యాపా రులంతా పరేషాన్లో ఉన్నారు.