కరాటేలో ప్రతిభ

ABN , First Publish Date - 2020-12-14T03:03:34+05:30 IST

ట్టణ కేంద్రంలోని మదర్‌ ల్యాబ్‌ స్కూల్‌లో ఆదివారం నిర్వహించిన కరాటే గ్రేడింగ్‌ టెస్టుల్లో విద్యార్థులు ప్రతిభ చాటారు.

కరాటేలో  ప్రతిభ
విద్యార్థులతో జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి

 అభినందించిన జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి 

వనపర్తి రూరల్‌, డిసెంబరు 13: పట్టణ కేంద్రంలోని మదర్‌ ల్యాబ్‌ స్కూల్‌లో ఆదివారం నిర్వహించిన కరాటే గ్రేడింగ్‌ టెస్టుల్లో విద్యార్థులు ప్రతిభ చాటారు. పెబ్బేరు మండలానికి చెందిన నాగభారతి, రాఘవేంద్ర, అనూష బ్లాక్‌ బెల్ట్‌, ఫస్టు డిగ్రీ సాధించారు. అరవింద్‌ సందీప్‌ బ్లూ బెల్ట్‌ సాధించారు. బాల కృష్ణ, కార్తీక్‌ ప్రపుల్‌ బెల్ట్‌ సాధించారు. వనపర్తి పట్టణానికి చెందిన లోకేష్‌, అరుణ్‌, వంశీ, చెర్రీ, సాయి, సంకేత సత్యకృష్ణ, ఆరంజ్‌ బెల్టులో హాసి నాకాల్‌, గణేష్‌  పసుపు బెల్ట్‌ను సాధించారు. అత్యంత ప్రతిభ కనబరిచిన వి ద్యార్థులకు  జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి  బంగారు పతకాలను అందించి వారిని అభినందించారు.  మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటీ శ్రీధర్‌, కౌన్సిలర్‌ రాధా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-14T03:03:34+05:30 IST