పగలే వెలుగుతున్న వీధి దీపాలు

ABN , First Publish Date - 2020-03-23T07:39:12+05:30 IST

విద్యుత్‌ అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా పట్టపగలే వీధి దీపాలు వెలుగుతూ వారి నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. దీంతో విలువైన విద్యుత్‌ వృధా...

పగలే వెలుగుతున్న వీధి దీపాలు

పెద్దమందడి, మార్చి 22: విద్యుత్‌ అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా పట్టపగలే వీధి దీపాలు వెలుగుతూ వారి నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. దీంతో విలువైన విద్యుత్‌ వృధా అవుతుం దన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీధి దీపాల నిర్వహణలో ఉన్న సమస్య లను విద్యుత్‌ సిబ్బంది పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలో చాలా గ్రామాల్లో వీధి దీపాలు నిరంత రం వెలుగుతూనే ఉన్నాయి. పగ లు, రాత్రి తేడా లేకుండా వెలుగు తుం డడంతో వందలాది యూని ట్లు విద్యుత్‌ వృథా అవుతున్నది.


ఫలితంగా విద్యుత్‌ శాఖ గ్రామ పంచాయతీలు తీవ్రంగా నష్టపోతు న్నాయి. ప్రత్యేక లైన్‌ లు ఆన్‌ఆఫ్‌ స్విచ్‌లను ఏర్పాటు చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. ప్రభు త్వం నిరంతరం విద్యుత్‌ను అందించడానికి వేల కోట్ల వెచ్చిస్తున్నా విద్యుత్‌ను ఆదా చేయాల్సిన సంబంధిత అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు.  పంచాయతీ ఆదాయం, జనాభా మేరకు విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయగా రాత్రి పూట ఆన్‌ చేసి ఉదయం పూట ఆఫ్‌ చేయాలి. కానీ అలా జరగడం లేదు.  దీంతో గ్రామ పంచాయతీలకు వేల రూపాయల బిల్లులు వస్తున్నాయి. అధికారులు స్పందించి గ్రామాలలో వీధిలైట్లకు ప్రత్యేక లైన్‌ ఏర్పా టుచేసి ఆన్‌ఆఫ్‌ స్విచ్‌లను ప్రజలు కోరుతున్నారు.


 స్విచ్‌లు ఏర్పాటు చేశాం

మండలంలోని చాలా గ్రామాల్లో వీధిలైట్లకు ఆన్‌ ఆఫ్‌ స్విచ్‌లను ఏర్పాటుచేశాం. 90శాతం గ్రామాల్లో పని చేస్తున్నాయి. పది శాతం త్వరలో పూర్తి చేస్తాం. అమ్మపల్లి గ్రామంలో పాతస్తంభాల  స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసే పనులు ప్రారంభమ య్యాయి.  


Updated Date - 2020-03-23T07:39:12+05:30 IST