నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
ABN , First Publish Date - 2020-10-17T06:57:02+05:30 IST
జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి శరన్న వరాత్రి ఉత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి
రోజుకో రూపంలో అమ్మవారు దర్శనం
కొవిడ్ నిబంధనల మేరకు పూజలు
నారాయణపేట, అక్టోబరు 16 : జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి శరన్న వరాత్రి ఉత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని పలు దేవాలయాల్లో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా శరన్న వరాత్రి ఉత్సవాలు జరిపేందుకునిర్వాహ కులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన నారాయణపేటలో అంబా భవాని, మరిగమ్మ దేవాలయాలు, రాఘవేంద్ర స్వామి ఆలయం, సాయి బాబాఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిం చనున్నారు.
మాణిక్యగిరి కొండపై వెంకన్న విగ్రహం
మాణిక్యగిరి కొండపై నారాయణపేటలోని ఏవీ మందార్ నివాసంలో వెండి వెంకన్న ఉత్సవ విగ్రహాన్ని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలకోసం తరలించారు. కొవిడ్ నిబంధనల మధ్య ఉత్సవ విగ్రహాన్ని కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి తరలించారు. కార్యక్రమంలో ట్రస్ట్ కమిటీ సభ్యులు ఏవీ మందార్, సరాఫ్ కృష్ణ, బండి శివరాం రెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్ హరి నారాయణ భట్టడ్, కౌన్సిలర్లు అనిత సుభాష్, బండి రాజేశ్వరి, ఆశ్రమ కమిటీ సభ్యులు, మాత భక్తులు పాల్గొన్నారు.
యానగుందిలో ...
జిల్లా కేంద్రమైన నారాయణపేట కర్ణాటక సరిహద్దులోని సూర్యనంది క్షేత్రం (యానగుంది)లో శనివారం నుంచి ఈనెల 21వ తేదీ వరకు వేంకటేశ్వరస్వామి, భవాని మాత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభ మౌతాయని ట్రస్ట్ కార్యదర్శి శివయ్య స్వామి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
సింగారం భవాని మాత ఆలయంలో....
నారాయణపేటరూరల్ : మండల పరిధిలోని సింగారం గ్రామంలోని శ్రీగిరి పీఠంపై వెలసిన భవాని మాత ఆలయంలో శనివారం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రోజువారిగా అమ్మవారిని వివిఽధ రూపాల్లో ప్రత్యేక పూజలు అందుకోనున్నారు.