ప్రాణం తీసిన పొగమంచు

ABN , First Publish Date - 2020-12-30T03:38:39+05:30 IST

మండలంలోని జిల్లేడిదిన్నె గ్రామానికి చెందిన పేతుర్‌ (21) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

ప్రాణం తీసిన పొగమంచు

- కల్వర్టును ఢీకొన్న బైక్‌

- ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం

    వడ్డేపల్లి, డిసెంబరు29 : మండలంలోని జిల్లేడిదిన్నె గ్రామానికి చెందిన పేతుర్‌ (21) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్‌ఐ శ్రీహరి తెలిపిన వివరాలు.. పేతురు హనుమన్న, రాజులతో కలిసి మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో బైక్‌పై జూలకల్‌ నుంచి శాంతినగర్‌కు బయలుదేరారు. పొగమంచులో రోడ్డు కన్పించకపోవడంతో జూలకల్‌వాగు వద్ద కల్వర్టురాయిని ఢీకొన్నారు. ప్రమాదంలో పేతురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  హనుమన్న పరిస్థితి విష మంగా ఉంది. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - 2020-12-30T03:38:39+05:30 IST