7వ ఆర్థిక గణనకు సమాయత్తం కావాలి

ABN , First Publish Date - 2020-02-16T06:09:04+05:30 IST

7వ ఆర్థిక గణనకు సమాయత్తం కావాలి

7వ ఆర్థిక గణనకు సమాయత్తం కావాలి

  • కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, ఫిబ్రవరి 15: జిల్లాలో 7వ ఆర్థిక గణన జూన్‌ మొదటి వారంలో పార్రంభం కానుందని, అందుకు అధికారులు సమాయత్తం కావాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశపు హాలులో నిర్వహించిన సమావేశంలో ఆర్థిక గణనపై సమీక్షించారు. ఇంటింటికి తిరిగి గణన చేయాలన్నారు. అందుకు ఎన్యూమరేటర్లుగా కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ల ప్రతినిధులను నియమించుకోవాలని ఆదేశించారు. 86 మంది సూపర్‌వైజర్లను, 472 మంది ఆపరేటర్లను నియమించినట్లు తెలిపారు. 2013లో 6వ ఆర్థిక గణన జరిగిందని, అప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులే ఆర్థిక గణన ప్రక్రియ చేపట్టారని తెలిపారు. ఆ ప్రక్రియ అంతా మ్యాన్‌వల్‌గా జరిగిందన్నారు. ఇప్పుడు అలా కాదని, ప్రతి ఇంటి ముందు కూర్చొని మొబైల్‌ యాప్‌లో అప్‌డేట్‌ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావు, ఇన్‌చర్జి డీఆర్‌ఓ జె.శ్రీనివాస్‌, జడ్పీసీఈఓ యాదయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-02-16T06:09:04+05:30 IST