సమస్యల పై ప్రభుత్వాన్ని నిలదీస్తాం
ABN , First Publish Date - 2020-12-14T03:01:17+05:30 IST
రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పె న్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం కృష్ణరెడ్డి అన్నారు.

గద్వాల టౌన్, డిసెంబరు 13: రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పె న్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం కృష్ణరెడ్డి అన్నారు. పట్టణంలోని డీకే బంగ్లాలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నా మన్నారు. ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీ ఇతర సమస్యలు చాలా ఏళ్లుగా అ పరిష్కృతంగా ఉండగా కేవలం ముఖ్యమంత్రి హామీలతోనే కాలం నెట్టుతు న్నారని ఆరోపించారు. ఈ ధర్నాకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అధి క సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. నాయకులు బండల వెంకటరాములు, సంజీవ్ భరద్వాజ్ తదితరులున్నారు.