మోకాళ్లపై నిలబడి నిరసన

ABN , First Publish Date - 2020-03-15T12:49:10+05:30 IST

ఫీల్డ్‌ అసిసెంట్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముం దు శనివారం మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. మహాత్మా

మోకాళ్లపై నిలబడి నిరసన

మూడో రోజు కొనసాగిన ఫీల్డ్‌ అసిస్టెంట్ల ధర్నా

పెద్దమందడి, మార్చి 14: ఫీల్డ్‌ అసిసెంట్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ  స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముం దు శనివారం మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.  మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లకు కనీస వేతనం రూ.20వేలు చెల్లించాలని, వారు డిమాండ్‌ చేశారు.  మూడు రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా ఫీల్డ్‌ అసిస్టెంట్ల సం ఘం నాయకులు రామ్‌రెడ్డి, భీమన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం తమకు ఉద్యోగ భద్రత కలిగించాలంటూ  ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన తెలిపామన్నారు.  ఈ కార్యక్రమంలో శేఖర్‌గౌడ్‌, రహీం, నరసింహగౌడ్‌, మళ్లియాదవ్‌, తేజ, గ్రామాల ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-15T12:49:10+05:30 IST