ప్రతి గింజా కొనుగోలు చేస్తాం

ABN , First Publish Date - 2020-11-26T04:21:39+05:30 IST

రైతులు పండించి న ప్రతి గింజాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంద ని,అధైర్యపడొద్దని అదనపు కలెక్టర్‌ సీతారామ రావు భరోసా ఇచ్చారు.

ప్రతి గింజా కొనుగోలు చేస్తాం
వేములలో వరి ధాన్యాన్ని పరిశీలిస్తున్న జిల్లా అదనపు కలెక్టర్‌ సీతారామరావు

 అదనపు కలెక్టర్‌ సీతారామరావు 

వేములలో ఐకేపీ కొనుగోలు కేంద్రం పరిశీలన


మూసాపేట, నవంబరు 26 : రైతులు పండించి న ప్రతి గింజాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంద ని,అధైర్యపడొద్దని అదనపు కలెక్టర్‌ సీతారామ రావు భరోసా ఇచ్చారు. బుధవారం మండల పరిధిలోని వేముల గ్రామంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన  కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడు తూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ధాన్యాన్ని కొ నుగోలు చేస్తామని, అపోహాలకు గురి కావద్దన్నా రు. రంగుమారిన వడ్లకు రైస్‌ మిల్లర్లలో ఏ రేటుకు తీసుకుంటారో అదేరేటుకు కొనుగోలు కేంద్రాలలో తీసుకుంటారన్నారు. ఈసారి అధికశాతం వరి పం డించారని, అయినా కొనుగోలు చేస్తామని,రైతులు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో  రైతుబంధు జిల్లా అధ్యక్షుడు గోపాల్‌ యాదవ్‌, త హసీల్దార్‌ మంజుల, ఎంపీడీఓ ఉమాదేవి, డిప్యూటీ తహసీల్దార్‌ వరప్రసాద్‌, ఎం రాజేం దర్‌రెడ్డి, సర్పంచ్‌ అరుణ,   రైతు బంధు మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-26T04:21:39+05:30 IST