తగ్గుతూ.. పెరుగుతూ...ఉమ్మడి జిల్లాలో 108 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-11-03T10:20:00+05:30 IST
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్యలో తగ్గుతూ, పెరుగుతూ ఉంది. ఆదివారం 77 కేసులు నమోదవగా, సోమవారం 108 మందికి వైరస్
నాగర్కర్నూల్ జిల్లాలో అధికంగా 41 కేసులు
మహబూబ్నగర్ వైద్య విభాగం/గద్వాలక్రైం/ కందనూలు/ వనపర్తి/ నారాయణపేట క్రైం, నవంబరు 2 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్యలో తగ్గుతూ, పెరుగుతూ ఉంది. ఆదివారం 77 కేసులు నమోదవగా, సోమవారం 108 మందికి వైరస్ సోకింది.
మహబూబ్నగర్ జిల్లాలో 25 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అందులో జిల్లా కేంద్రంలో 13, వివిధ మండలాల్లో 12 కేసులు నమోదయ్యాయి.
జోగుళాంబ గద్వాల జిల్లాలో సోమవారం ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. గద్వాల పట్టణంలోనే ఇద్దరు కరోనా బారిన పడగా జిల్లాలోని మిగితా మండలాలలో ఐదుగురికి కరోనా సోకింది.
నాగర్కర్నూల్లో 41 మంది కరోనా బారిన పడ్డారు. అందులో ఎక్కువగా నాగర్కర్నూల్ మండలంలో 15 కేసులు నమోదయ్యాయి. ఇతర మండలాల్లో 26 కేసులు నమోదయ్యాయి.
వనపర్తి జిల్లాలో 28 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అందులో వనపర్తి మండలంలోనే అధికంగా 13 మంది బాధితులున్నారు. మరో 15 కేసులు ఇతర మండలాల్లో నమోదయ్యాయి.
నారాయణపేట జిల్లాలో ఏడుగురికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.