బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

ABN , First Publish Date - 2020-12-29T03:56:30+05:30 IST

మండల కేంద్రం నుంచి గోకులపాడు గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహాం భూమి పూజ చేశారు.

బీటీ రోడ్డు నిర్మాణానికి  భూమిపూజ
బీటీ రోడ్డు పనులకు భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే అబ్రహాం

        మానవపాడు, డిసెంబరు 28 : మండల కేంద్రం నుంచి గోకులపాడు గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహాం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎస్‌డీఎఫ్‌ నిధుల కింద రూ.55కోట్లతో 44రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఏవో నరేంద్ర, సర్పంచ్‌ నర్సింహులు, ఎంపీటీసీ సభ్యుడు సాములు, పీఏసీఎస్‌ చైర్మన్‌ అయ్యన్న, చెన్నయ్య, కాంట్రాక్టరు వెంకటేష్‌, వడ్డేపల్లి జడ్పీటీసీ రాజు, నాయకులు అనంతరెడ్డి, అల్లబకాష్‌, వెంకటేశ్వర్లు  ఉన్నారు.


సమస్యలపై ప్రశ్నించిన గ్రామస్థులు

వడ్డేపల్లి : మండలంలోని తిమ్మాజిపల్లెలో పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే అబ్రహాం సోమవారం భూమి పూజ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా, స్థానికులు సమస్యలపై ప్రశ్నించారు. ఎమ్మెల్యే వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. ఎవరూ వినకపోవడంతో వేదిక దిగి వెళ్లిపోయారు.  మాధవి,  రజితరాజు,  రాజు, ఆంజనేయులున్నారు.


Updated Date - 2020-12-29T03:56:30+05:30 IST