గురుకుల పాఠశాలలో వసతులపై ఆరా

ABN , First Publish Date - 2020-12-31T02:58:23+05:30 IST

మండలంలోని బుద్దారంగండి సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలలో వసతులపై మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరా తీశారు.

గురుకుల పాఠశాలలో వసతులపై ఆరా

 గోపాల్‌పేట, డిసెంబరు  30: మండలంలోని బుద్దారంగండి సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలలో వసతులపై మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరా తీశారు. బుధవారం సాయంత్రం 6:30గంటలకు ఆయన పాఠశాలకు చేరుకొని  ఉపాధ్యా యులతో మాట్లాడారు. గోపాల్‌పేట, పెద్దమందడి మండలాలకు చెందిన సుమారు 1500 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని, వసతులు సరిగా లేవని సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడే ఇంటర్మీడియట్‌ తరగతులు నిర్వహించడం ఇబ్బందిగా ఉందని అధ్యాపకులు తెలిపారు. 

Updated Date - 2020-12-31T02:58:23+05:30 IST