ముందస్తు అరెస్టులు అమానుషం

ABN , First Publish Date - 2020-03-13T10:55:24+05:30 IST

ముందస్తు అరెస్టులు అమానుషం

ముందస్తు అరెస్టులు అమానుషం

- ఉపాధ్యాయ జేఏసీ నాయకుడు గోపాల్‌ 

- జిల్లాలో 25 మంది టీచర్ల అరెస్టు

- హామీల అమలు కోరుతూ నేడు చలో అసెంబ్లీ


గద్వాలక్రైం, మార్చి 12 : ఉపాధ్యాయ సంఘాల నాయకుల అరెస్ట్‌ అమానుషమని ఉపాధ్యాయ జేఏసీ నాయకుడు గోపాల్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్య మంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ శుక్రవారం చలో అసెంబ్లీ నిర్వహించ తలపెట్టినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం తగదని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని తిప్పన్న, యూనుస్‌ పాష, రామ్‌మోహన్‌, సోంసుందర్‌రెడ్డి, ప్రకాష్‌, వెంకటయ్య డిమాండ్‌ చేశారు. 


జిల్లా వ్యాప్తంగా 25 మంది అరెస్టు

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం వరకు 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. శాంతినగర్‌లో తొమ్మిది మంది, ధరూర్‌లో ఆరుగురు, మానవపాడులో ముగ్గురు, గట్టులో ఒక్కరు, కేటీ దొడ్డిలో నలుగురు, మల్దకల్‌లో ఇద్ద రు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2020-03-13T10:55:24+05:30 IST