మార్కెట్లో రూ. 22.24 లక్షల లావాదేవీలు
ABN , First Publish Date - 2020-12-03T04:20:51+05:30 IST
దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం రూ. 22.24 లక్షల లావాదేవీలు జరిగినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ సుగుణ తెలిపారు.
దేవరకద్ర,డిసెంబరు 2: దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం రూ. 22.24 లక్షల లావాదేవీలు జరిగినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ సుగుణ తెలిపారు. మండలంలోని వి విధ గ్రామాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు మార్కెట్యార్డుకు తీసుకు వచ్చారన్నారు.ఇనాంటెండర్లలో ఆముదాలు క్వింటాల్కు గరిష్ఠంగా రూ. 4252, కనిష్ఠంగా రూ. 4148, సోనా క్వింటాల్ గరిష్ఠంగా రూ. 1766, కనిష్ఠంగా రూ. 1534, హంస క్వింటా ల్కు గ రిష్ఠంగా రూ. 1529, కనిష్ఠంగా రూ. 1439 ధర పలికినట్లు తెలిపారు. ఆముదాలు 12క్వింటాళ్లు, సోనా 1224 క్వింటాళ్లు, హంస 24 క్వింటాళ్లు అమ్మకానికి వచ్చాయని ఆమె వివరించారు.