చిరుతల సంచారం
ABN , First Publish Date - 2020-12-18T05:05:13+05:30 IST
మన్యంకొండ దేవస్థానం దిగువన రైతు ల పంటపొలాల్లో కొద్దిరోజులుగా చిరు త పులులు సంచరిస్తుండటం అటు దే వస్థానానికి వచ్చిన భక్తులు, రైతులను భయబ్రాంతులకు గురిచేస్తోంది.

పగ్మార్క్లను గుర్తించిన అటవీశాఖ అధికారులు
అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి
మహబూబ్నగర్, డిసెంబరు 17: మన్యంకొండ దేవస్థానం దిగువన రైతు ల పంటపొలాల్లో కొద్దిరోజులుగా చిరు త పులులు సంచరిస్తుండటం అటు దే వస్థానానికి వచ్చిన భక్తులు, రైతులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. మూ డు, నాలుగు రోజులుగా పులులు కని పిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెం దుతున్నారు. అటవీశాఖ రేంజ్ అధికారి రాములు ఆధ్వర్యంలో గురువారం మన్యంకొండ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారు ల బృందం పర్యటించింది. ఆయా ప్రాంతాల్లో తిరిగి పులుల పగ్ మార్క్లను గుర్తించారు. రైతు వడ్డెర చంద్రయ్య పులులను చూసినట్లు చెప్పడంతో అతడి వద్దకు వెళ్లి అధికారులు వివరాలు సేకరించారు. రైతు తాను రెండ్రోజుల పాటు రెండు పులులను చూసినట్లు వాటిని ఎక్కడె క్కడ చూశానో ఆ ప్రాంతాలను అధికారులకు చూయించారు. అతడిచ్చిన సమాచారం మేరకు అక్కడ పులుల జాడలను అధికారులు గుర్తించి నిజంగానే అవి చిరుత పులుల పగ్మార్కు లేనని తేల్చారు. ఈ సందర్భంగా అటవీశాఖ రేంజ్ అఽధికారి మాట్లాడుతూ రెండ్రోజులుగా త మకు పులులు సంచరిస్తున్నట్లు ఫోన్లు వస్తు న్నాయని, ఇక్కడ పగ్మార్కులను గుర్తించామ న్నారు. పులులు తెల్లవారుజామున 5 గంట లకు, సాయంత్రం 5-6గంటల లోపు నీ టిని తా గేందుకు నీళ్లు ఉన్నచోటకు వస్తుంటాయన్నా రు. ఇక్కడ కూడా నీళ్లు తాగేందుకు వచ్చే స మయంలో రైతు చంద్రయ్య వాటిని చూసినట్లు తెలిపారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని అధికారులు సూచించారు. మహబూ బ్నగర్ జిల్లాలో 7-8 పులులు ఉన్నాయని, ఇక్కడ రెండు సంచరిస్తున్నట్లు గు ర్తించామన్నారు. అయితే ఇప్పటివరకు ఈ పులులు ఎవరిపైనా దాడికి పాల్పడ లేదు. పులుల విషయం తెలుసుకున్న స్థానికుల్లో, ముఖ్యంగా ఆ ప్రాంత రైతుల్లో ఆందోళన వ్యక ్తమవుతోంది.