-
-
Home » Telangana » Mahbubnagar » man dead
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-12-20T02:59:43+05:30 IST
పెంట్లవెల్లి జటప్రోలు మార్గం మధ్యలో శనివారం రాత్రి అగి ఉ న్న ట్రాక్టర్ను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

పెంట్లవెల్లి, డిసెంబరు 19: పెంట్లవెల్లి జటప్రోలు మార్గం మధ్యలో శనివారం రాత్రి అగి ఉ న్న ట్రాక్టర్ను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘ టనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేశ్వరం గ్రామానికి చెందిన మద్దిలేటి (45) రోజువారిగా జటప్రోల్ గ్రామానికి మేస్త్రీ పని వెళ్లాడు.. పనులు ముగించుకొని సాయంత్రం తిరిగి వస్తుండగా జటప్రోల్, పెంట్లవెల్లి మర్గం మధ్యలో సైడ్కు అగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టడంతో మద్దిలేటి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఏఎస్ఐ ఖాయ్యూం తెలిపారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.