కేంద్రం వైఖరితో వరి కొనుగోలులో జాప్యం: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-12-06T04:20:48+05:30 IST
కేంద్ర ప్రభు త్వం వైఖరితో తెలంగాణలో వరి కొనుగోల్లో జాప్యం జరుగుతుందని ఎమ్మెల్యే ఆల వెంకటే శ్వర్రెడ్డి ఆరోపించారు.
మూసాపేట, డిసెంబరు 5 : కేంద్ర ప్రభు త్వం వైఖరితో తెలంగాణలో వరి కొనుగోల్లో జాప్యం జరుగుతుందని ఎమ్మెల్యే ఆల వెంకటే శ్వర్రెడ్డి ఆరోపించారు. శనివారం మండల ప రిధిలోని నిజాలాపూర్లో సింగిల్ విండో ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోని వడ్లను ఎమ్మెల్యే ఆల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేందు ఏవో కొర్రీలు పెడుతోంద ని అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీ సుకవచ్చి పండించిన పంటలకు గిట్టు బాటు ధర లేకుండా చేస్తుందని ఆయన ఆరోపించా రు. కార్యక్రమంలో జడ్పీటీసి సభ్యులు ఇంద్ర య్యసాగర్, నాయకులు తదితరులున్నారు.