-
-
Home » Telangana » Mahbubnagar » Lets work together for urban progress
-
పట్టణ ప్రగతికి కలిసి పని చేద్దాం
ABN , First Publish Date - 2020-12-29T04:00:45+05:30 IST
పట్టణ అభివృద్ధికి అందరం కలిసి పని చేద్దామని కోస్గి ముని సిపల్ చైర్పర్సన్ మేకల శిరీష పిలుపునిచ్చారు.

- కోస్గి ముని సిపల్ చైర్పర్సన్ మేకల శిరీష
కోస్గి, డిసెంబరు 28: పట్టణ అభివృద్ధికి అందరం కలిసి పని చేద్దామని కోస్గి ముని సిపల్ చైర్పర్సన్ మేకల శిరీష పిలుపునిచ్చారు. సోమవారం మునిసిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం మంజూరు చేసిన రూ.15కోట్లను సద్విని యోగం చేసుకొని కోస్గి పట్టణ సమగ్రాభి వృ ద్ధికి సభ్యులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా సభ్యులు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసు కువచ్చారు. సభ్యులకు తెలి యకుండా ఏ తీర్మానం కూడా ఆమోదించరాదని సూచించారు. గతంలో పట్ట ణ పారిశుధ్య పనుల కోసం రూ. 7.50లక్షలతో కొనుగో లు చేసిన ఎలక్ట్రికల్ వాహ నాలు మూలకుపడ్డాయ న్నారు. మునిసిపల్ పరిధిలోని గ్రామాల లో చెత్తనిల్వలు తొలగించేందుకు నాలుగు సై కిల్ రిక్షాలను కొనుగోలు చేయాలని సభ్యులు తీర్మానించారు. కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జునస్వామి, వైస్చైర్పర్సన్ కోడిగంటి అన్నపూర్ణ, కౌన్సిలర్లు జనార్దన్రెడ్డి, యెను గుండ్ల బాలేష్, మాస్టర్శ్రీనివాస్, బందెప్ప, ప ద్మావతి, మంజుల, బెజ్జు సంగీత, లింగం లక్ష్మి, కస్తూరమ్మ, బానునాయక్, మేనేజర్ శం కర్నాయక్ పాల్గొన్నారు.