రామ రాజ్యంగా తెలంగాణ

ABN , First Publish Date - 2020-04-28T10:15:11+05:30 IST

తెలంగాణను రామరాజ్యంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న కృషి మరువలేనిదని గద్వాల

రామ రాజ్యంగా తెలంగాణ

14 సంవత్సరాలు పోరాటం చేసిన కేసీఆర్‌

టీఆర్‌ఎస్‌ అవిర్భవ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి


గద్వాల, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణను రామరాజ్యంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న కృషి మరువలేనిదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ అవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన గద్వాల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేశారు.


అనంతరం అమరవీరుల స్థూపానికి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో గద్వాల మునిసిపాలిటీ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, కౌన్సిలర్లు, ఇతర నాయకులు ఉన్నారు.

Updated Date - 2020-04-28T10:15:11+05:30 IST