జర ్నలిస్ట్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి

ABN , First Publish Date - 2020-12-06T04:02:10+05:30 IST

గుండె పోటుతో మృతి చెందిన జర్నలిస్ట్‌ హబీబ్‌ కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

జర ్నలిస్ట్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 5: గుండె పోటుతో మృతి చెందిన జర్నలిస్ట్‌ హబీబ్‌ కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శనివారం హబీ బ్‌ ఇంటికి వెళ్లిన మంత్రి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉం డాలని, అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. వెంటనే డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇస్తామని, భార్యకు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని, పిల్లలను రెషిడెన్షియల్‌ లో చదివిస్తామని అన్నారు. జర్నలిస్ట్‌లు తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. సావరీ న్‌ సంస్థ ఇస్తున్న రూ.50 వేల చెక్కును మంత్రి చేతులమీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో సంగీత అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, డీపీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, సావరిన్‌ సంస్థ అధ్యక్షుడు కోదండపాణి, జర్నలిస్ట్‌లు బస్వరా జు, గోవర్ధన్‌గౌడ్‌, షాబుద్దీన్‌, జాఫర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T04:02:10+05:30 IST