విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
ABN , First Publish Date - 2020-12-14T03:19:30+05:30 IST
విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని బోమ్మరాజుపల్లి పరిధిలోని బుర్గువానికుంట తండాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్నది.

ఊర్కొండ, డిసెంబరు 13: విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని బోమ్మరాజుపల్లి పరిధిలోని బుర్గువానికుంట తండాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేనావత్ పాండునాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం పొలం పనులకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చే సరికి విద్యుదాఘాతంతో ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఇంట్లో ఉన్న బీరువా, టీవీ, దుస్తులతో పాటు, డబ్బులు, బియ్యం పూర్తిగా మంటల్లో కాలి బూడిద కాగా, రూ.లక్ష ఆస్తినష్టం జరిగిందని తెలిపారు. బాధిత కుటుంబం కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలలేదని కన్నీరుమున్నీరయ్యారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కంసానిపల్లిలో గుడిసె..
ఉప్పునుంతల: మండల పరిఽఽఽఽఽధిలోని కంసానిపల్లి గ్రామంలో ఆదివారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో కలమండల లక్ష్మయ్యకు చెందిన గుడిసె దగ్ధం అయినట్లు గ్రామస్ధులు తెలిపారు. మంటలలో నిత్యావస సరుకులతో పాటు బట్టలు, వంట సామాగ్రి పూర్తిగా దగ్ధం అయిన్నట్లు బాధితులతో పాటు గ్రామస్ధులు తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఉపసర్పంచ్ లింగమయ్య, నాయకులు రేణయ్య, సాయిబాబు, రామస్వామి, శ్రీను తదితరులు కోరారు.