అందరికీ అందుబాటులో న్యాయసేవలు : గోవిందరెడ్డి
ABN , First Publish Date - 2020-10-28T10:44:11+05:30 IST
న్యాయసేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని బదిలీపై సికింద్రాబాద్ వెళ్తున్న మూడవ జిల్లా అదనపు కోర్టు న్యాయమూర్తి గోవిందరెడ్డి అ న్నారు.

గద్వాలక్రైం, అక్టోబరు 27: న్యాయసేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని బదిలీపై సికింద్రాబాద్ వెళ్తున్న మూడవ జిల్లా అదనపు కోర్టు న్యాయమూర్తి గోవిందరెడ్డి అన్నారు. బదిలీపై వెళుతున్న ఆయనను సిబ్బంది మంగళవారం శాలువా, పూలమాలలలో ఘ నంగా సన్మానించారు. ఇన్చార్జి అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసులు, సీనియర్ సివిల్ జడ్జి వీరయ్య, జూనియర్ సివిల్ జడ్జి ఉషాక్రాంతి, కోర్టు సూపరింటెండెంట్లు శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ, సాబేర్ అహ్మద్, సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లు ఉన్నారు.