ముగిసిన మునిసిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక
ABN , First Publish Date - 2020-09-12T10:36:20+05:30 IST
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని నాగర్కర్నూల్ మునిసిపాలిటీ కార్యాలయంలో మునిసిపల్ చైర్పర్సన్ కల్పన అధ్యక్షతన ..

కందనూలు, సెప్టెంబరు 11 : నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని నాగర్కర్నూల్ మునిసిపాలిటీ కార్యాలయంలో మునిసిపల్ చైర్పర్సన్ కల్పన అధ్యక్షతన మునిసిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక శుక్రవారం ముగిసింది. క్రిస్టియన్, మైనార్టీ విభాగంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యులు లూయిస్ స్టిలీష్, మహ్మద్ ముస్తాక్ హైమద్లు ఎన్నికయ్యారు. అనుభవజ్ఞుల విభాగంలో తన్వరి లలిత, నర్సింహ్మారెడ్డిలు ఎన్నికయ్యారు. అనంతరం వారికి నియామక పత్రాలు అందజేసి వారిని సన్మానించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన నలుగురి సభ్యులను డీసీసీబీ డైరెక్టర్ జక్కారఘునందన్రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బాబురావు, మునిసిపల్ కమీషనర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చిత్రపటానికి క్షీరాభిషేకం
కల్వకుర్తి అర్బన్, సెప్టెంబర్ 11 : మండలం పరిధిలోని రఘపతిపేట గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అసెంబ్లీలో ప్రస్తావించడంతో ఆ గ్రామ నాయకులు శుక్రవారం గ్రామంలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.