డంప్‌ చేసిన ఇసుక సీజ్‌

ABN , First Publish Date - 2020-09-14T10:51:53+05:30 IST

మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామ శివారులోని దుందుంభీ వాగులో కృత్రిమంగా తయారు చేసి, డంప్‌ చేసిన ఇసుకను ఆదివారం సీజ్‌ చేశారు

డంప్‌ చేసిన ఇసుక సీజ్‌

రాజాపూర్‌, సెప్టెంబరు 13: మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామ శివారులోని దుందుంభీ వాగులో కృత్రిమంగా తయారు చేసి, డంప్‌ చేసిన ఇసుకను ఆదివారం సీజ్‌ చేశారు. గ్రామ కావలికారు తహసీల్దార్‌ శంకర్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో ఆ ఇసుకను తిర్మలాపూర్‌లో నిర్మించనున్న రైతు వేదిక భవన నిర్మాణానికి తరలించనన్నుట్లు తహసీల్దార్‌ తెలిపారు. ఇసుకను కృత్రిమంగా తయారు చేసి, డంప్‌ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2020-09-14T10:51:53+05:30 IST