డ్రెయినేజీలో ‘భగీరథ’ పైప్‌లైన్‌

ABN , First Publish Date - 2020-12-11T03:52:31+05:30 IST

మురుగునీరు కలిసి తాగు నీరు కలుషితమవుతోంది. భగీరథ పైప్‌లైన్‌ డ్రెయినేజీలోంచి ఉండడమే అందుకు కారణం.

డ్రెయినేజీలో ‘భగీరథ’ పైప్‌లైన్‌
మురుగుకాలువలో ఉన్న భగీరథ పైప్‌లైన్‌

- కలుషితమవుతున్న జలం

    గద్వాలక్రైం, డిసెంబరు 10: మురుగునీరు కలిసి తాగు నీరు కలుషితమవుతోంది. భగీరథ పైప్‌లైన్‌ డ్రెయినేజీలోంచి ఉండడమే అందుకు కారణం. గద్వాల పట్టణంలోని మూడవ వార్డులోని వేణుకాలనీలో ఈ పరిస్థితి నెలకొన్నది. కలుషితమైన నీటిని తాగడంతో అనా రోగ్యానికి గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఆ నీళ్లు తాగడంతో మా ఇంటి ల్లిపాది రోగాల బారిన పడ్డామని కాలనీ వాసి శివ తెలిపారు. ఈ విషయంపై మునిసిపల్‌ అధికారులు, సిబ్బందికి పలుమార్లు చెప్పినా ఫలితం లేదని వార్డు కౌన్సి లర్‌ గీతమ్మ నాగులయాదవ్‌ అన్నారు. ఇప్పటి కైనా అధి కారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని  పలువురు కోరుతున్నారు.


Updated Date - 2020-12-11T03:52:31+05:30 IST