తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతాం
ABN , First Publish Date - 2020-10-03T09:49:03+05:30 IST
రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారంలో వచ్చి తీరుతామని బీజేపీ జాతీయ ఉ పాధ్య క్షురాలు డీకే అరుణ అన్నారు.
దేవుడితో కాదు..ఆంధ్రా సీఎంతో కొట్లాడు
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
చిన్నచింతకుంట/ దేవరకద్ర, అక్టోబరు 2: రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారంలో వచ్చి తీరుతామని బీజేపీ జాతీయ ఉ పాధ్య క్షురాలు డీకే అరుణ అన్నారు. శుక్రవారం మ హబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో నియోజక వర్గ నాయకుడు డోకూరు పవన్కుమార్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ అనే రాక్షసుడు దేవుడితోనే కొట్టాడు తాడా అని ఎద్దేవా చేశారు. ముందు దేవుళ్లతో కాదు ఆంధ్రా సీఎంతో, నీళ్ళు తరలించుకుపో తున్న వారిమీద కొట్లాడు అని హితవు పలికా రు.
ప్రజలను మాయమాటలతో గారఢీ చేసే ప్రయత్నాలను మానుకోవాలని, బీజేపీకి రాష్ట్రంలో కూడా అవకాశం ఇవ్వాలన్నది ప్రజల అభిప్రాయంగా తెలుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చినా, కేసీఆర్ నేనే పథకాలు అందిస్తు న్నానంటూ గొప్పలు చెప్పుకుంటున్నార న్నారు. పార్టీని మరింత బలోపేతం చేసి, రాష్ట్రంలో అధికారంతోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం డీకే అరుణను పార్టీ నాయకులు, ఆయా మం డలాల కార్యకర్తలు శాలువాతో సన్మానించా రు. సమావేశంలో బీజేపీ నాయకులు యజ్ఞ భూపాల్రెడ్డి, నంబిరాజు,కుర్వరమేష్, ధశరత్, రాములు పాల్గొన్నారు.
డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరిక
చిన్నచింతకుంట మండలంలోని ముచ్చిం తల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ఉపాధ్యక్షుడు రఘురాం జనార్ధన్రెడ్డి, నాయ కులు బాలవర్ధ్ధన్రెడ్డి, సూదిరెడ్డి అశోక్రెడ్డి తదితరులు డీకె అరుణ, డోకూరు పవన్కు మార్రెడ్డి సమక్షలో బీజేపీలో చేశారు.