వైభవంగా విగ్రహాల ఊరేగింపు
ABN , First Publish Date - 2020-02-28T11:10:42+05:30 IST
మండలంలోని దగడపల్లిలో విగ్రహాల ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ప్రతిష్ఠించే సీతారాములు, శివుడు, లక్ష్మీన రసింహ స్వామి, నవగహ్రాలు, ఆంజనేయస్వామి తదితర విగ్రహాలను కృష్ణానదిలో జలాధివాసం చేయించి గురువారం ఉదయం దగడపల్లి గ్రామానికి తీసుకొచ్చారు.
వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో కిక్కిరిసిన దగడపల్లి
చిన్నంబావి, ఫిబ్రవరి 27: మండలంలోని దగడపల్లిలో విగ్రహాల ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ప్రతిష్ఠించే సీతారాములు, శివుడు, లక్ష్మీన రసింహ స్వామి, నవగహ్రాలు, ఆంజనేయస్వామి తదితర విగ్రహాలను కృష్ణానదిలో జలాధివాసం చేయించి గురువారం ఉదయం దగడపల్లి గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామం ఊరి బయటనుంచి విగ్రహాలకు మహిళలు పెద్దఎత్తున మంగళహార తులతో స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి గ్రామం వీధుల గుండా ఊరేగించారు. గ్రామస్థులతో పాట వివిధ గ్రామాల నుంచి వేడుకలకు వచ్చిన భక్తులు అత్యధికంగా పాల్గొన్నారు. దీంతో దగడపల్లి గ్రామం కిక్కిరిసిపోయింది. ఆలయం వద్ద బ్రాహ్మణులు హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, దేవాలయ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.