ఇప్పటూర్లో కరోనా కలకలం
ABN , First Publish Date - 2020-04-25T10:02:10+05:30 IST
మండల పరిధిలోని ఇప్పటూర్ గ్రామంలో శుక్రవారం కరోనా కలకలం రేగింది. గ్రామానికి చెందిన బెస్త శ్రీనివాస్ (45) అనేవ్యక్తి గత పదిహేను

చనిపోయిన వ్యక్తిని అర్ధరాత్రి దహనం
తొమ్మిది మందికి గృహ నిర్బంధం
నవాబ్పేట, ఏప్రిల్ 24 : మండల పరిధిలోని ఇప్పటూర్ గ్రామంలో శుక్రవారం కరోనా కలకలం రేగింది. గ్రామానికి చెందిన బెస్త శ్రీనివాస్ (45) అనేవ్యక్తి గత పదిహేను రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అదే రోజు అర్దరాత్రి మూడుగంటలకు నవాబ్పేట ఎస్ఐ శ్రీకాంత్ సమక్షంలో దహనం చేశారు. శుక్రవారం ఉదయం మండల వైద్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి, తహసీల్దార్ రాజేందర్రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్లు గ్రామానికి చేరుకుని శ్రీనివాస్ బంధువులను వారి ఇంట్లోనె ఉంచి 28 రోజులపాటు బయటికి రాకుండా ఉండాలని సూచించారు. శ్రీనివాస్ పోస్టుమార్టం రిపోర్టులు ఇంకా రాకపోవడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.