రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
ABN , First Publish Date - 2020-02-08T10:37:23+05:30 IST
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరు గుతుందని, అందుకే సీఏఏ, ఎన్ఆర్సీ లాంటి చట్టాలను బీజేపీ ప్రభు త్వం తీసుకు వస్తోందని సీపీఎం జిల్లా

- సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్
వనపర్తి పురపాలకం: రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరు గుతుందని, అందుకే సీఏఏ, ఎన్ఆర్సీ లాంటి చట్టాలను బీజేపీ ప్రభు త్వం తీసుకు వస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ ఆరోపించారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. నేటి పాలకుల వల్లే రాజ్యాంగం హక్కుకు భంగం కలుగుతుం దన్నారు. జిల్లా కేంద్రంలో యాదవ్ సంఘం భవ నంలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా సదస్సును ఆదివారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, రాష్ట్ర కార్యదర్శి డీజీ నర్సింహరావు హాజరౌతారన్నారు. ఈ సమావేశానికి మేధా వులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, మైనార్టీలు అందరూ అధిక సం ఖ్యలో పాల్గొన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమా వేశంలో గోపాలకృష్ణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.