భారత రాజ్యాంగం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2020-11-27T03:23:20+05:30 IST

భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, విద్యార్థి దశ నుంచే రాజ్యాంగంపై పూర్తి అ వగాహన కలిగి ఉండాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజులు అ న్నారు.

భారత రాజ్యాంగం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిదాయకం
అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న జిల్లా విద్యాధికారి గోవిందరాజులు

- డీఈవో గోవిందరాజులు

కందనూలు, నవంబరు 26: భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, విద్యార్థి దశ నుంచే రాజ్యాంగంపై పూర్తి అ వగాహన కలిగి ఉండాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజులు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్స వం సందర్భంగా గురువారం డీ ఈవో కార్యాలయంలో రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.  కార్యాలయ సహాయ సంచాలకులు అశోక్‌, సెక్టోరల్‌ అధికారులు కుర్మయ్య, మంతటి నారాయణ, కార్యాలయం పర్యవేక్షకులు మురళికృష్ణ, కార్యాలయ సిబ్బంది రవియాదవ్‌, నాగేందర్‌, శ్రీనివాసాచారి, శైలజ, మౌనిక, వెంకట్‌, విశ్వనాథ్‌, సాయి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.  భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మాలమహానాడు ఉపాధ్యక్షుడు రా వుల శ్రీనివాసులు, మండల అధ్యక్షుడు ఆలూరి కరుణకుమార్‌ గురువారం జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌.అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివా ళులర్పించారు.  జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చింత సత్తి, జిల్లా సహాయ కార్యదర్శి పూస కురు మయ్య, విద్యార్థి విభాగం పవన్‌కుమార్‌, ఎల్లి మధు, మంచాల ఆనంద్‌ పాల్గొన్నారు. 

 



Updated Date - 2020-11-27T03:23:20+05:30 IST