అమ్మానాన్న ద్విశతి స్మృతి కావ్యం పుస్తకావిష్కరణ

ABN , First Publish Date - 2020-11-22T03:43:56+05:30 IST

ప్రము ఖ రచయిత్రి శాంతారెడ్డి రచించిన అమ్మానాన్న దిశ్వతి స్మృతి కావ్యం పుస్తకాన్ని శనివారం మహ బూబ్‌నగర్‌లోని లుంబినీ పాఠశాలలో ఆవిష్కరిం చారు.

అమ్మానాన్న ద్విశతి స్మృతి కావ్యం పుస్తకావిష్కరణ
ప్రముఖ రచయిత్రి శాంతారెడ్డి రచించిన అమ్మానాన్న ద్విశతి స్మృతికావ్య పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సాహితీవేత్తలు

మహబూబ్‌నగర్‌ టౌన్‌, నవంబరు 21: ప్రము ఖ రచయిత్రి శాంతారెడ్డి రచించిన అమ్మానాన్న దిశ్వతి స్మృతి కావ్యం పుస్తకాన్ని శనివారం మహ బూబ్‌నగర్‌లోని లుంబినీ పాఠశాలలో ఆవిష్కరిం చారు. ఆమె తల్లిదండ్రులు ప్రమీలమ్మ, కృష్ణారెడ్డి జీవితాన్ని, వారి వ్యక్తిత్వాన్ని, సామాజిక సేవలు, విద్యార్థులను తీర్చిదిద్దిన వైనాన్ని చక్కగా అక్షరీక రించారని తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షు డు పొట్లూరి హరికృష్ణ అన్నారు. కార్యక్రమంలో లుంబినీ పాఠశాల అధినేత లక్ష్మణ్‌గౌడ్‌, రావూరి వనజ, డాక్టర్‌ పొద్దుటూరి ఎల్లారెడ్డి, రవీందర్‌ గౌడ్‌, గన్నోజు శ్రీనివాసాచారి, చెన్నయ్య, నక్క సుభాషిణి, శ్రీదేవి, భారతి, జమున, యాదయ్య, లక్ష్మీనరసింహ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-22T03:43:56+05:30 IST