డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలి

ABN , First Publish Date - 2020-12-30T03:12:30+05:30 IST

చిట్యాల శివారులో పట్టాలు పొందిన లబ్ధిదారులకు మొదటగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కే టాయించాలని టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షుడు నందిమళ్ల అ శోక్‌ డిమాండ్‌ చేశారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలి
మాట్లాడుతున్న టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షుడు నందిమళ్ల అశోక్‌

వనపర్తి టౌన్‌, డిసెంబరు 29: చిట్యాల శివారులో పట్టాలు పొందిన లబ్ధిదారులకు మొదటగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కే టాయించాలని టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షుడు నందిమళ్ల అ శోక్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రభుత్వ విప్‌గా ఉన్నప్పుడు 226మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఒక్కరికి 100గజాల చొప్పున ఇళ్ల నిర్మాణానికి పట్టాలు ఇచ్చారన్నారు. నాయకులు బాలయ్య, వహీద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T03:12:30+05:30 IST