వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లు
ABN , First Publish Date - 2020-12-30T03:16:01+05:30 IST
కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లుగా మారనున్నాయని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్రెడ్డి ఆందోళన చెందారు.
అమరచింత/ఆత్మకూర్, డిసెంబరు 29: కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లుగా మారనున్నాయని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్రెడ్డి ఆందోళన చెందారు. ఆత్మకూర్లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి మోకరిల్లి వ్యవసాయ బిల్లులు మంచివని పొగుడతున్నా కేసీఆర్ ద్వంద వైఖరి బయటపడిందని తెలిపారు కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, పరమేష్ పాల్గొన్నారు.