మధిర యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా అన్వేష్
ABN , First Publish Date - 2020-12-06T04:51:01+05:30 IST
మధిర యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా బిచ్చాల అన్వేష్ గెలుపొందారు. ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన అన్వేష్ యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో మధిర నియోజకవర్గ కార్యదర్శిగా గెలుపొందారు.
ముదిగొండ, డిసెంబరు 5: మధిర యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా బిచ్చాల అన్వేష్ గెలుపొందారు. ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన అన్వేష్ యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో మధిర నియోజకవర్గ కార్యదర్శిగా గెలుపొందారు. ఆయన మాట్లాడుతూ తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్కు కృతజ్ఞతలు తెలిపారు. అన్వేష్ ఎన్నిక పట్ల మండల కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు.