రామయ్య సేవలో టుబాకో బోర్డు చైర్మన్‌

ABN , First Publish Date - 2020-12-11T04:52:30+05:30 IST

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని టుబాకో బోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు గురువారం దర్శించుకున్నారు.

రామయ్య సేవలో టుబాకో బోర్డు చైర్మన్‌
రామాలయంలో యడ్లపాటి రఘునాథబాబు

భద్రాచలం, డిసెంబరు 10: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని టుబాకో బోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు గురువారం దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఆయన వెంట దేవస్థానం పర్యవేక్షకులు లింగా ల సాయిబాబా, వేద పండితులు ఎం.రవికుమార్‌ శర్మ, బీజేపీ నాయకులు యర్రంరాజు బెహార, ఏనుగుల వెంకటరెడ్డి ఉన్నారు. 


Updated Date - 2020-12-11T04:52:30+05:30 IST