ఇసుక మాఫియా అంటేనే అధికార టీఆర్ఎస్ నాయకులు-పోతినేని
ABN , First Publish Date - 2020-07-05T10:31:37+05:30 IST
ఇసుక మాఫియా అంటేనే అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులని, వారికి ముదిగొండ అడ్డాగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని
ముదిగొండ, జూలై 4: ఇసుక మాఫియా అంటేనే అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులని, వారికి ముదిగొండ అడ్డాగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ ఆరోపించారు. శనివారం పెద్దమండవలోని మున్నేరు ఇసుక ర్యాంపును సీపీఎం బృందంతో కలిసి ఆయన సందర్శించి పరిశీలించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో పోతినేని మాట్లాడుతూ అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ వ్యాపారం సాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఎం రా ష్ట్ర నాయకుడు పొన్నం వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా నాయకులు బండి రమేష్, పద్మ, మండల కార్యదర్శి వరప్రసాద్, వైస్ఎంపీపీ దామోదర్, సొసైటీ వైస్చైర్మన్ పురుషోత్తం, తిరుపతి, భాస్కర్రావు, ప్రభావతి, పుల్లయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.