విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి పరీక్షలకు సన్నద్ధం చేయాలి
ABN , First Publish Date - 2020-02-08T08:42:13+05:30 IST
పదోతరగతి విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్ అన్నారు. మండలంలోని కేరేగు బల్లి

కేరేగుపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన పీవో
దుమ్ముగూడెం ఫిబ్రవరి 7: పదోతరగతి విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్ అన్నారు. మండలంలోని కేరేగు బల్లి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల తోపాటు, లక్ష్మీనగరం జీసీసీ దుకాణాన్ని శుక్ర వారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. విద్యా ర్థుల సంఖ్యను తెలుసుకోవడంతోపాటు, తరగతి గదులను పరిశీలించారు. డిజిటల్ తరగతుల ద్వారా ప్రతీ సబ్టెక్జునూ అర్థమయ్యేలా చూపా లని, సందేహాలుంటే నివృత్తి చేయాలని సూచిం చారు. ప్రతీ విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాల న్నారు. అనంతరం జీసీసీ డీఆర్ డిపోను తనిఖీ చేసి రేషన్, కిరోసిన్ వివరాలను తెలుసుకున్నారు. గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తుల వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో డీటీడీవో జహీరుద్దీన్, ఇన్చార్జి హెచ్ఎం మంజుల, జీసీసీ సిబ్బంది వీరస్వామిలున్నారు.