గొర్రపేటవాగు డైవర్షన్ పనుల పరిశీలన
ABN , First Publish Date - 2020-02-08T08:53:10+05:30 IST
సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో సింగరేణి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఫారెస్ట్రీ అడ్వజర్ సరేంద్ర పాండే శుక్రవారం పర్యటించారు.

మణుగూరురూరల్, ఫిబ్రవరి 7: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో సింగరేణి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఫారెస్ట్రీ అడ్వజర్ సరేంద్ర పాండే శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఏరియాలోని ఓసి-2 గని విస్తరణలో బాగంగా చేపట్టిన గొర్రపేటవాగు డైవర్షన్ పనులను ఏరియా జిఎం జక్కం రమేష్, అటవీశాఖ అధికారులతో కలసి పరిశీలించారు. పని ప్రదేశంలో జరుగుతున్న ట్రీ ఫిల్లింగ్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ట్రీ ఫిల్లింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఈ పర్యటనలో ఏరియా ఎఫ్డీవో టి వేణుబాబు, ఎఫ్ఆర్ఓ ప్రసాదరావు, ఫారెస్ట్ మేనేజర్(కార్పోరేట్)లు హరినారాయణ, కర్ణా, ఎస్వోటు జిఎం బోగ వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్ లక్ష్మిపతిగౌడ్, డీజీఎం సివిల్ వెంకటేశ్వర్లు, ఏరియా సర్వే ఆఫీసర్ పిఎస్కె రవి, ఎస్టేట్ ఆఫీసర్ ఉషాశ్రీ, ఎన్వీరాన్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, సెక్యూరిటీ ఆఫీసర్ షబ్బీరుద్దీన్లు పాల్గొన్నారు.