సంక్షేమ పథకాలు అందరికీ అందాలి
ABN , First Publish Date - 2020-11-26T05:04:56+05:30 IST
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా పనిచేయాలని జడ్పీ సీఈవో విద్యాలత పేర్కొన్నారు.

జడ్పీ సీఈవో విద్యాలత
చుంచుపల్లి, నవంబరు 25: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా పనిచేయాలని జడ్పీ సీఈవో విద్యాలత పేర్కొన్నారు. గురువారం మండలంలోని విద్యానగర్ కాలనీ, త్రీ ఇంక్లైన్, రామాంజనేయ కాలనీ పంచాయతీల్లో ప్రభుత్వ పథకాల నిర్మాణాలను తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశానుసారం ప్రతి పంచాయతీలో క్రిమిటోరియా, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, ప్రతి పంచాయతీకో నర్సరీ, ఎవె న్యూ ప్లాంటేషన్ను వాటి దశలను బృందాలుగా పరిశీలిస్తున్నామని తెలిపారు. నిర్మాణాలు ఆగిపోయిన పనులు ప్రారంభం కానీ పంచాయతీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి ఎంపీడీవో సకినాల రమేష్, ఎంపీవో గుంటి సత్యనారాయణ, ఏపీవో రఘుపతి, విద్యానగర్, త్రీ ఇంక్లైన్, రామాంజనేయకాలనీ సర్పంచ్లు బానోతు గోవింద్, ఆంగోతు ఘాతి, సరిత జ్ఞానమూర్తి, పంచాయతీ కార్యదర్శులు రియాజుద్దీన్, భవాని, ఈజీఎస్ సిబ్బంది అనిల్, ఆస్మ, రాజు, నాగరాజు, ఏఈవో అనూష, సిబ్బంది పాల్గొన్నారు.