జర్నలిస్టుపై పోలీసుల దాడి అమానుషం

ABN , First Publish Date - 2020-03-25T11:29:19+05:30 IST

హైదరాబాద్‌లో ఆంధ్రజ్యోతి పొలిటికల్‌ బ్యూరోచీఫ్‌ శ్రీనివా్‌సపై పోలీసులు దాడి చేయడం అమానుషమని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా నాయకులు తీవ్రంగా ఖండించారు.

జర్నలిస్టుపై పోలీసుల దాడి అమానుషం

ఇల్లెందుటౌన్‌, మార్చి 24: హైదరాబాద్‌లో ఆంధ్రజ్యోతి పొలిటికల్‌ బ్యూరోచీఫ్‌ శ్రీనివా్‌సపై పోలీసులు దాడి చేయడం అమానుషమని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఇల్లెందులో ఐజేయూ జిల్లా నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు, గుడివాడ శ్రీనివాస్‌, సుమంత్‌, నర్సి, వీరమోహన్‌ మాట్లాడుతూ పోలీసుల చర్యలను తీవ్రంగా పరిగణించాలని, పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. భాద్యులైన పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.  


Updated Date - 2020-03-25T11:29:19+05:30 IST